చంద్రబాబు ప్రకటనను బట్టి తెలంగాణ ఇవ్వాలి: పొన్నం

Ponnam Prabhakar
హైదరాబాద్‌: తెలంగాణపై తమ వైఖరిని ఇప్పటికే ప్రకటించామని చెప్పిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటనను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెసు తెలంగాణ స్టీరింగ్ కమిటీ సమావేశానంతరం ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీలు, ప్రజలు ప్రాంతాలుగా విడిపోయినట్లు చెప్పిన కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన తెలంగాణ రాష్ట్ర విభజనకు సరిపోతుందని ఆయన అన్నారు. తెలంగాణపై చిదంబరం ప్రకటన అర్థరహితమని ఆయన అన్నారు.

రాజీనామా చేసిన తెలంగాణ మంత్రులు విధులకు, పార్లమెంటు సభ్యులు పార్లమెంటుకు హాజరు కాకూడదని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పార్లమెంటు సభ్యుల రాజీనామాలపై నిర్ణయం వెలువడిన తర్వాతనే శాసనసభ్యులు తిరిగి రాజీనామా చేసే విషయంపై ఆలోచన చేస్తామని శానససభ్యుడు రాజయ్య చెప్పారు. ఎవరో చెప్తే తాము రాజీనామాలు చేయబోమని, తమ కార్యాచరణ తమకు ఉందని ఆయన చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య తెలంగాణ వ్యతిరేకి అని, రోశయ్య వల్లనే 2009 డిసెంబర్‌లో అసెంబ్లీ తీర్మానం ఆగిపోయిందని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. రోశయ్య మాట వినాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి విరామం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.

సోనియా త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ రేపు, ఎల్లుండి ప్రార్థనలు చేయాలని తెలంగాణ స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు బ్రోకర్‌గా అభివర్ణించడాన్ని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం తప్పు పట్టారు. కెటిఆర్ పిల్ల చేష్టలు మానుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 9వ తేదీని అమరవీరుల దినంగా పరిగణించాలని కాంగ్రెసు స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+