రక్తమోడిన ఆంధ్రప్రదేశ్: ప్రమాదాల్లో 11 మంది మృతి
పశ్చిమ గోదావరి జిల్లాలో లారీ, ఆటోలు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు సమీపంలోని చేబ్రోలు వద్ద చోటు చేసుకుంది. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. వారు ద్వారకా తిరుమల స్వామిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అయినప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరంతా తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు వాసులుగా తెలుస్తోంది.
నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం శోభనాద్రిగూడెంలో ఓ ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇందులో పలువురు తీవ్ర గాయాలయ్యాయి. కాగా హైదరాబాదులోని టోలీచౌకి వద్ద ఉదయం ఓ బైకును లారీ గుద్దు కోవడంతో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు లారీకి నిప్పంటించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.