వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుళ్లోని పంచలోహ విగ్రహాలు దొంగిలించాడని....

By Srinivas
|
Google Oneindia TeluguNews

Warangal
వరంగల్‌: దేవాలయంలో పంచలోహ విగ్రహాలు దొంగిలించాడనే అనుమానంతో స్థానికులు ఓ వ్యక్తిపై దాడి చేసి అతని ఇంటిని తగుల బెట్టిన సంఘటన వరంగల్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. జిల్లాలోని చేర్యాల మండలం నాగపురి గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో నాలుగు నెలల క్రితం పంచలోహ విగ్రహాలు చోరికి గురయ్యాయి. ఆ పంచలోహ విగ్రహాలను పోలీసులు ఇటీవల విజయవాడలో పట్టుకున్నారు.

అయితే ఈ చోరీలో గ్రామానికి చెందిన గుంటుపల్లి నర్సింహులు అనే వ్యక్తి హస్తమున్నట్లు గ్రామస్థులకు అనుమానం వచ్చింది. దీంతో ఆదివారం అతని ఇంటి వద్దకు వెళ్లి అతనిపై దాడి చేశారు. అనంతరం అతని ఇంటిని తగలబెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు వచ్చి లాఠీఛార్జి చేసి గ్రామస్థులను చెదరగొట్టారు. ఫైర్ ఇంజన్ మంటలు ఆర్పింది. అయితే ఇళ్లు చాలా వరకు ఖాళీ పోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
Nagapuri villagers of Warangal district burnt one person resident due to theft in Venugopala Swamy temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X