ఉరి తీయాల్సిందే: బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీం

2006 అక్టోబర్ 23వ తేదీన గ్యాంగ్స్టర్ దారాసింగ్ను కాల్చి చంపిన కేసులో రాజస్థాన్కు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సభ్యులైన డిజిపి (అదనపు) అరవింద్ జైన్, ఎస్పీ అర్షద్ లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లొంగిపోని పక్షంలో వారిని అరెస్టు చేసి, వారిపై సిబిఐ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో మాజీ మంత్రి రాజేందర్ రాథోడ్ తప్పించుకుని తిరుగుతున్నాడని దారాసింగ్ భార్య సుశీలా దేవి కోర్టుకు విన్నవించుకుంది. విధులకు భిన్నమైన చర్యకు దిగే పోలీసు అధికారులకు సామాన్యులకు విధించే శిక్ష కన్నా కఠినమైన శిక్ష విధించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications