హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్పీకర్ నాదెండ్ల మనోహర్‌పై మిస్సింగ్ కేసు: నాగం

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్‌: శానససభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌పై మిస్సింగ్ కేసు పెడతామని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని ఆయన శాసనసభ కార్యదర్శికి ఆయన చెప్పారు. నాగం జనార్దన్ రెడ్డితో పాటు తెలుగుదేశం తెలంగాణ ప్రాంత తిరుగుబాటు శాసనసభ్యుడు హరీశ్వర్ రెడ్డి అసెంబ్లీ గేటు వద్ద బైఠాయించారు. నాదెండ్ల మనోహర్ వచ్చే వరకు ఇక్కడే బైఠాయిస్తానని నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు. ఆయన శాసనసభ ఆవరణలోని చెట్ల కింద బైఠాయించారు. తమ రాజీనామాలను ఆమోదించకుండా స్పీకర్ తప్పించుకుని తిరుగుతున్నారని ఆయన విమర్శించారు.

మొదటిసారి రాజీనామాలు చేసినప్పుడు తాము స్పీకర్‌ను కలిస్తే ముఖాముఖి మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ చెప్పారని, అయితే అందుకు విరుద్ధంగా రాజీనామాలను భావోద్వేగం కారణం చెప్పి తిరస్కరించి విదేశాలకు వెళ్లిపోయారని, మళ్లీ రాజీనామాలు సమర్పించినా ప్రతిస్పందించడం లేదని ఆయన అన్నారు. స్పీకర్ తన కార్యాలయానికి కూడా రావడం లేదని ఆయన అన్నారు. స్పీకర్ ఎప్పుడు వస్తారో, ఎక్కడున్నారో తెలియడం లేదని, తమ మెయిల్స్‌కు కూడా సమాధానం ఇవ్వడం లేదని ఆయన అన్నారు. స్పీకర్ పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని ఆయన విమర్శించారు. సీమాంధ్రులకు అనుకూలంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారనే అనుమానం కలుగుతోందని హరీశ్వర్ రెడ్డి అన్నారు.

English summary
TDP suspended MLA nagam janardhan Reddy, who resortfed to dharna in assembly premises, said thar he will complaint against speaker to police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X