హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వ్యాఖ్యలపై నో కామెంట్ అన్న బొత్స సత్తిబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో పాటు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని తదితర అంశాలపై డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన మాటలకు బొత్స స్పందిస్తూ తమ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉందని దానిని నిరూపించుకుంటామని చెప్పారు.

తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నట్టు 14ఎఫ్ పైనా చిత్తశుద్ధి ఉందని చెప్పారు. 14ఎఫ్ పైన ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం జరిగిందని మరోసారి తీర్మానం అవసరం లేదని చెప్పారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. యువతను ఆకర్షించడానికే వారసులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అయితే రాజకీయాల్లో వారసత్వం ఉండదని స్పష్టం చేశారు. కాగా మంగళవారం కాంగ్రెసు పార్టీకి చెందిన పలువురు నేతల తనయులతో బొత్స భేటీ ఆయిన విషయం తెలిసిందే.

English summary
PCC chief Botsa Satyanarayana said today rejected to comment on YSR Congress party president YS Jaganmohan Reddy's statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X