వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ తిలక్‌నగర్ పోలీసు స్టేషన్‌లో తెరాస నేతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌కు చెందిన ఉద్యోగి చందర్రావు దాడి కేసులో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు శుక్రవారం ఢిల్లీలోని తిలక్ నగర్ పోలీసు స్టేషన్‌లో హాజరయ్యారు. ఈ కేసులో తెరాస నేతల హరీష్ రావు, ఈటెల రాజేందర్, కె.తారక రామారావు, జి.వినోద్ కుమార్‌ ఎసిపి ముందు హాజరయ్యారు. ఎసిపి అడిగిన అన్ని ప్రశ్నలకు తాము సమాధానాలు చెప్పామని, పిలిచినప్పుడల్లా వస్తామని చెప్పామని హరీష్ రావు మీడియా ప్రతినిధులతో చెప్పారు.

చందర్ రావుపై దాడి కేసులో స్వయంగా స్టేషన్‌లో హాజరుకావాలని పోలీసులు తెరాస నేతలకు నోటీసులు పంపించారు. ఇందుకోసం గురువారం వరకు వారు గడువు విధించారు. ఈ గడువు ముగిసిపోవడంతో శుక్రవారం తెరాస నేతలు ఢిల్లీకి చేరుకుని పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఇటీవల పార్లమెంట్ భవనం ఎదుట ఆత్మహత్య చేసుతున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన యాదిరెడ్డి మృతదేహాన్ని ఏపీ భవన్‌కు తీసుకుని వచ్చినప్పుడు అడ్డు చెప్పడంతో చందర్ రావుపై తెరాస నాయకులు దాడి చేశారు.

English summary
TRS leaders Harish Rao and others attended at Tilaknagar PS in New Delhi in attack on Chandar Rao case at AP Bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X