ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి వల్లనే ఇక్కడ ప్రజాస్వామిక ఉద్యమం: బాలకృష్ణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna
ఖమ్మం: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నందమూరి హీరో బాలకృష్ణ సోమవారం ఖమ్మం జిల్లాలోని ఓ కళాశాలలో హల్ చల్ చేశారు. తమ అభిమాన హీరో రాకతో కళాశాల విద్యార్థులు కేరింతలు కొట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బాలయ్య ఆ కళాశాలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతనే రాష్ట్రంలో అందరికీ రాజకీయం దగ్గరయిందని బాలకృష్ణ అన్నారు. రాజకీయాలు సామాన్యులకు సైతం దగ్గర కావడానికి తెలుగుదేశం పార్టీయే కారణం అని అన్నారు.

దేశంలో అవినీతి, అక్రమాలు హెచ్చుమీరి పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతమరో ప్రజాస్వామిక ఉద్యమం జరిగిందని అన్నారు. కాగా బాలకృష్ణ రాముడిగా, నయనతార సీతగా నటిస్తున్న శ్రీరామరాజ్యం చిత్రం పాటల ఆడియో విడుదల కోసం బాలయ్య భద్రాచలం పర్యటిస్తున్నారు.

English summary
Hero Balakrishna created hulchul in a college of Khammam district today. He hausted national flag in college and addressed students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X