వైయస్ జగన్‌ను వదలిపెట్టని టిడిపి, కాంగ్రెసు నేతలు

YS Jagan
హైదరాబాద్: సిబిఐ విచారణ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు మరోసారి టార్గెట్ చేశాయి. జగన్‌ను వారు ఏ మాత్రం వదిలిపెట్టడం లేదు. తన ఆస్తులపై సిబిఐ విచారణ జరిపించాలని హైకోర్టు సిబిఐని ఆదేశించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని జగన్ నిర్ణయించుకోవడంతో ఆ పార్టీలు మళ్లీ మాటల యుద్ధం ప్రారంభించాయి. సిబిఐ విచారణకు అంగీకరించి జగన్ నిజాయితీ నిరూపించుకోవాలని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు అంటున్నాయి. తాజాగా, కాంగ్రెసు నాయకులు రాయపాటి సాంబశివరావు జగన్‌ను విమర్శించే వర్గంలో చేరిపోయారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కూడా జగన్ సిబిఐ విచారణకు అంగీకరించి నిజాయితీని నిరూపించుకునే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. జగన్‌పై చాలా కాలంగా వి. హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. పరిటాల రవి హత్య కేసు సందర్భంలో జగన్‌పై కక్ష కట్టే వైయస్ రాజశేఖర రెడ్డి సిబిఐ విచారణ జరిపించారా అని ఆయన సోమవారం అడిగారు. దమ్ముంటే తన ఆస్తులపై విచారణ చేయించుకోవాలని సవాల్ చేసిన జగన్ ఇప్పుడు ఎందుకు వెనకాడుతున్నారని ఆయన అడిగారు.

తెలంగాణ నాయకులు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ వంటి నాయకులు కూడా జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ జగన్‌పై ఎడతెరిపి లేని విమర్శలు చేస్తున్నారు. ఆయన ప్రతి రోజూ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. వైయస్సార్‌కు అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఆ మధ్య జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+