విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సుష్మా స్వరాజ్ అడుగుజాడల్లో జగన్: లగడపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
విజయవాడ: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ అడుగుజాడల్లో నడుస్తున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సోమవారం అన్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తన కార్యాలయంలో లగడపాటి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బాటలో నడిస్తే ఆయన తనయుడు జగన్ మాత్రం బిజెపి నేత సుష్మా స్వరాజ్ బాటలో నడుస్తున్నారని విమర్శించారు.

జగన్ చేస్తున్నది ఓదార్పు యాత్రనో, సంబరాల యాత్రనో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వైయస్ఆర్ పై వస్తున్న అవినీతి ఆరోపణలపై జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దేశానికి జాతీయ జెండా ఒక్కటే ఉంటుందని స్వాతంత్ర్య దినోత్సవం రోజున అదొక్కటే ఎగుర వేయాలన్నారు. కానీ తెలంగాణ అంటూ ప్రత్యేక జెండా ఎగురవేయడం రాజ్యాంగ విరుద్దం అన్నారు. జాతీయ జెండాతో పాటు తెలంగాణ జెండా ఆవిష్కరించడాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని అన్నారు. రాష్ట్రాలకు జెండాలు ఉండటం సరికాదన్నారు.

English summary
Vijayawada Parliamen Member Lagadapati Rajagopal accused that YSRC party president YS Jaganmohan Reddy going with BJP leader Sushma Swaraj foot prints.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X