సోనియా గాంధీ మెరుగ్గా ఉన్నారు: రాహుల్
సోనియా గాంధీ ఈ నెలారంభంలో శస్త్ర చికిత్స చేయించుకోవడానికి అమెరికా వెళ్లారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పతాకావిష్కరణ కార్యక్రమానికి రాహుల్ గాంధీ సోమవారం హాజరయ్యారు. సీనియర్ కాంగ్రెసు నాయకుడు మోతీలాల్ వోహ్రాను జాతీయ పతాకను ఆవిష్కరించాల్సిందిగా ఆయన కోరారు. సోనియా గాంధీ గైర్హాజరీలో తాను పతాకావిష్కరణ చేయనున్నట్లు జరిగిన ప్రచారానికి ఆయన ఆ విధంగా తెర వేశారు
పార్టీ కార్యాలయంలోని జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం తర్వాత రాహుల్ గాంధీ ప్రధానితో సమావేశమయ్యారు. వారి మధ్య దాదాపు గంట సేపు సాగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, అంబికా సోనీ, పార్టీ అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది కూడా పాల్గొన్నారు. అన్నా హజారే దీక్ష నేపథ్యంలో పరిణామాలను రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.