జగన్కు డోర్స్ క్లోజ్, సిబిఐ దర్యాప్తు ముమ్మరం
కాగా, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సిబిఐ తన దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. దర్యాప్తు తీరుపై సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ అధికారులతో చర్చించారు. జగన్ ఆస్తులు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుల దర్యాప్తునకు ఢిల్లీ, బెంగుళూర్ల నుంచి కూడా రెండు బృందాలు వచ్చాయి. ఒక్కో బృందంలో నలుగురున్నారు. బుధవారం సిబిఐ అధికారులు కొంత మంది పత్రాలను పరిశీలిస్తున్న సమయంలోనే మరికొంత మంది సోదాల్లో పాల్గొన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ఐఎఎస్ అధికారి బిపి ఆచార్యను, మరో 13 మందిని రహస్య ప్రదేశంలో సిబిఐ విచారిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్ ఆడిటర్కు సిబిఐ బుదవారం నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. జగతి ఆడిటర్తో పాటు జగన్ కంపెనలలో పెట్టుబడులు పెట్టిన మరో 12 కంపెనీలకూ సిబిఐ నోటీసులు జారీ చేసింది. కంపెనీల ప్రతినిధులను సైతం వ్యక్తిగతంగా హాజరు కావాలని సిబిఐ ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా వరదరాజన్ను విచారణ చాలా కీలకంగా మారనున్నట్టు తెలుస్తోంది. జగతి పబ్లికేషన్స్ కంపెనీ సెక్రటరీ కార్తిక్ను సిబిఐ మంగళవారం రాత్రి విచారించింది.