మేకపాటి రాజీనామా, మరిన్ని రోజుల తర్వాత సబ్బం

ఈ వర్షాకాల సమావేశాలే తాను పాల్గొనే చివరి సమావేశాలని సబ్బం హరి చెప్పారు. తాను లోకసభ సమావేశాలు ముగిసే లోగా రాజీనామా చేస్తానని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఎఫ్ఐఆర్లో వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చినందుకు నిరననగా తాను రాజీనామా చేసినట్లు మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయి వైయస్ జగన్మోహన్ రెడ్డినే కాకుండా వైయస్ రాజశేఖర రెడ్డిని కూడా బద్నాం చేయాలని చూస్తున్నాయని ఆయన విమర్సించారు. వైయస్ జగన్ కేసులో సిబిఐ అత్యంత వేగంగా దర్యాప్తును చేపట్టడాన్ని బట్టే కుట్ర జరుగుతోందని అర్థమవుతోందని ఆయన అన్నారు. వైయస్ జగన్ నాయకత్వ లక్షణాలు తనను ఆకట్టుకున్నాయని ఆయన చెప్పారు.
రాజీనామా చేసిన తర్వాత జరిగే ఎన్నికల్లో తాము ఓడిపోతే జగన్ అవినీతిపరుడని అంగీకరిస్తామని సబ్బం హరి అన్నారు. తాము జగన్ను బలపరుస్తున్నామని ఆయన చెప్పారు. జగన్ బయటకు వెళ్తే కాంగ్రెసు గందరగోళంలో పడుతుందని కనీసం యాభై సార్లు చెప్పానని, ఇప్పుడు కాంగ్రెసు పార్టీ కచ్చితంగా గందరగోళంలో ఉందని ఆయన అన్నారు. రాజకీయాల్లో ఒకే వైఖరిపై ఉండడం సాధ్యం కాదని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డి వంటివారు వైయస్ మరణించిన తర్వాత ఏం మాట్లాడారో ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. మరో వారం రోజులు ఆగాలని వైయస్ జగన్ తనకు చెప్పారని, దాంతోనే ఆగానని ఆయన చెప్పారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications