వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ పార్టీకి మాజీ సిఎం రోశయ్యనే కారణమా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Rossaiah
హైదరాబాద్: రాష్ట్ర ప్రస్తుత పరిస్థితికి మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్యనే కారణమనే నిందలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోశయ్య పార్టీ అధిష్టానానికి సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్లనే అటు తెలంగాణపై 2009 డిసెంబర్ 9వ తేదీన ప్రకటన వెలువడిందని, అలాగే వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని పెట్టే పరిస్థితిని తెచ్చిందని గిట్టనివారు రోశయ్యపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర పరిస్థితిపై, తెలంగాణ ఉద్యమంపై రోశయ్య పార్టీ అధిష్టానానికి సరైన సమాచారం అందించలేకపోయారని, దానివల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన చేశారని అంటున్నారు. చిదంబరం ప్రకటన వెలువడి ఉండకపోతే తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఇంత తీవ్రంగా ఉండేది కాదని అంటున్నారు.

అదే సమయంలో వైయస్ జగన్ విషయంలో రోశయ్య తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరైన విధంగా వ్యవహరించి ఉంటే సమస్య వచ్చేది కాదని అంటున్నారు. జగన్ ఓదార్పు యాత్రను కొనసాగినిచ్చి ఉంటే పరిస్థితి చేయి దాటి పోయేది కాదని, రోశయ్య వల్లనే ఓదార్పు యాత్రపై అధిష్టానం కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని చెబుతున్నారు. అలాగే, వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులతో, నాయకులతో రోశయ్య సరిగా మాట్లాడలేదని, వారిని దూరం పెడుతూ వచ్చారని, దీంతో జగన్ వర్గంలో ఓ విధమైన అసంతృప్తి ఏర్పడిందని, ఇవ్వన్నీ కలిసి వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీ నుంచి తప్పుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పెట్టారని అంటున్నారు. ఏమైనా, పెద్దాయన రోశయ్యను సమస్యలు వీడడం లేదు.

English summary
It is said that former CM Rosaiah was blamed for the present crisis in Andhrapradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X