బాబు పాదయాత్రలో జగన్ పార్టీ కార్యకర్తల ఘర్షణ

Chandrababu Naidu
తిరుపతి: తెలుగుదేశం పార్ట అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో నిర్వహించిన పాదయాత్రలో ఘర్షణ చెలరేగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలకు మధ్య సోమవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. అవినీతికి వ్యతిరేకంగా చంద్రబాబు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. వారిని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో ఘర్షణ చోటు చేసుకుంది.

చంద్రబాబు తన ఆస్తుల వివరాలు వెల్లడించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకు ముందు చంద్రబాబు అవినీతిపై కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఇటీవలి కాలంలో చంద్రబాబు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తూ వైయస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. జగన్‌కు చెందిన సాక్షి దినపత్రికపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+