ఈలోగా చచ్చిపోతావేమోనంటే ఏం చెప్పాలి: కావూరి
రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవాల్సి వస్తే శాస్త్రీయంగా, నిర్దిష్టమైన ప్రమాణాలతో దేశాన్ని విభజించేందుకు నిర్ణయం తీసుకోవాలని తాము సూచించినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే అదే ప్రాతిపదికపై దేశాన్ని విభజించాలని సూచించామని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం వెనక ఎవరు ఉన్నారో, ఎందుకు ఉన్నారో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆజాద్తో చెప్పినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ సమస్య పరిష్కారంలో జాప్యం చేయవద్దని, జాప్యం చేస్తే రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందనీ ఇరు ప్రాంతాల మధ్య శత్రుభావన పెరుగుతుందని చెప్పామని ఆయన అన్నారు. గులాం నబీ ఆజాద్తో ఇవే తమ చివరి చర్చలని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన అంశంపై తాము మళ్లీ ఢిల్లీకి రాబోమని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తు హైదరాబాద్ అంశంపై చర్చిద్దామని తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ప్రతిపాదనను తాము బలపరచడం లేదని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ చెప్పారు. వీలైనంత త్వరలో తెలంగాణ సమస్యను పరిష్కరిస్తామని ఆజాద్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము కోరినట్లు ఆయన చెప్పారు. ఉండవల్లి తాను అటువంటి ప్రతిపాదనే చేయలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారని కావూరి సాంబశివ రావు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆజాద్తో భేటీలో కావూరి సాంబశివరావు, శైలజానాథ్, గల్లా అరుణకుమారి, పాలడుగు వెంకటరావు, టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప రెడ్డి తదితరులు పాల్గొన్నారు.