హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అర్ధరాత్రి చిరంజీవిని కలిసిన బొత్స సత్యనారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana-Chiranjeevi
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం అర్ధరాత్రి తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవిని కలిశారు. వ్యక్తిగత పనుల వల్ల చిరంజీవి నాలుగు రోజుల పాటు మలేషియా వెళ్లారు. చిరంజీవి వెళ్లడానికి ముందు బొత్స వెళ్లి ఆయనను కలిశారు. ప్రజారాజ్యం పార్టీ ప్రాంతీయ విలీనంపై చర్చించారు. ప్రజారాజ్యం పార్టీ ఇరవై రోజుల క్రితం అధికారికంగా విలీనం అయినప్పటికీ నియోజకవర్గ స్థాయిలో విలీనం విషయాన్ని స్థానికులకు తెలపాలనే ఉద్దేశ్యంతో ప్రాంతీయ స్థాయిలో విలీన కార్యక్రమాలను చేపడుతున్నారు.

ఇందులో భాగంగా ఇటీవల కొన్ని ప్రాంతాలలో విలీనం కార్యక్రమాలు చేపట్టారు. ఈ నెల 25వ తారీఖున విశాఖపట్నంలో విలీన కార్యక్రమం ఉంటుందని సోమవారం బొత్స ప్రకటించారు. పలు ప్రాంతీయ విలీన కార్యక్రమాలను చిరంజీవి ఆధ్వర్యంలో చేపడుతున్నారు. కాగా భేటీ అనంతరం చిరంజీవి మలేషియా బయలుదేరి వెళ్లారు. బొత్స సత్యనారాయణ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మూడు రోజులు అక్కడే ఉంటారు. పిసిసి, డిసిసి పునర్వవ్యస్థీకరణ, బాన్సువాడ ఉప ఎన్నికలపైన ఆయన అధిష్టాంతో చర్చిస్తారని సమాచారం.

English summary
PCC chief Botsa Satyanarayana met Tirupati MLA Chiranjeevi on monday mid night at talk about merger.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X