గాలి గతే జగన్కు, మిడిసిపడితే అంతే: చంద్రబాబు
అవినీతిపరులు తప్పించుకోలేరని అన్నారు. సెజ్ల పేరుతో పేదల భూములను కాంగ్రెసు ప్రభుత్వం దోచుకుందని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చొక్కా నలగకుండా ఆకాశంలో తిరుగుతున్నారన్నారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి పనులు మాత్రం జరగటం లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేదు పాలన లేదన్నారు. ఈ నెల 18 నుంచి గ్రామస్థాయిల్లో కేంద్ర, రాష్ట్ర కార్యక్రమాలను స్తంభింపజేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో 82శాతం మంది అప్పుల్లో కూరుకు పోయారన్నారు. రైతులను ఆదుకోవాలంటే స్వామినాథన్ సిఫార్సులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం రైతులు పోరాటానికి సిద్ధం కావాలన్నారు. నేతలు పెరిగిన ఆదాయాన్ని పంచుకు తింటున్నారని ఆరోపించారు. అప్పులు, పన్నుల వేధింపుల్లో రాష్ట్రమే మొదటి స్థానంలో ఉందన్నారు. కాగా ప్రకాశం జిల్లాలో ఆయన మంగళవారం నుండి మూడు రోజుల పాటు పర్యటిస్తారు. పంట నష్ట పోయిన రైతులను పరామర్శిస్తారు.