బొత్సతో విభేదాలు లేవు, స్కీమ్స్ వైయస్వి కావు: సిఎం
వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు అధిష్టానం ఇచ్చిన స్వేచ్ఛతోనే సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. కాంగ్రెసులో ఎప్పుడూ వ్యక్తులు ముఖ్యం కాదని పార్టీయే ముఖ్యమన్నారు. మోహన్ కందా ఇచ్చిన నివేదికను అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యోగుల సకల జనుల సమ్మెపై నివేదిక వచ్చాక స్పందిస్తానని చెప్పారు. నో వర్క్ నో పే నిర్ణయం ప్రభుత్వానిది కాదన్నారు. హైకోర్టు డైరెక్షన్ ప్రకారమే జరుగుతుందన్నారు. మంత్రులంతా తమ ఆస్తులను ప్రకటించాలని చెప్పారు.
వ్యాట్ పెంచక తప్పని పరిస్థితి ఉందన్నారు. విద్యుత్ చార్జీల పెంపుపై పరిశీలన జరుగుతోందని అయితే పెంచే ఉద్దేశ్యం లేదన్నారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీలో కోతలుండవన్నారు. త్వరలో మరికొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెడతామని చెప్పారు. సంక్షేమ పథకాలు ఎత్తివేస్తారనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. అక్రమ విద్యుత్ కనెక్షన్ల గుర్తింపు కోసమే వ్యవసాయ బావులకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 40 శాతం సేవలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 108, 104 సేవల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.