సకల జనుల సమ్మెపై ముఖ్యమంత్రి సీరియస్

సకల జనుల సమ్మె తీవ్రత దృష్ట్యా మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సకల జనుల సమ్మె విజయవంతం కాకుండా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఏం చేయాలో ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా తెలంగాణలో సమ్మె కారణంగా సీమాంధ్ర ప్రాంతం నుండి ఉద్యోగులను తీసుకు వచ్చి పని చేయించుదామనుకున్నప్పటికీ అది విజయవంతం కాదనే ఉద్దేశ్యంతో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. కాగా ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా సమ్మెపై నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications