నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నలుగురు బాలికలను మింగిన చెరువు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mahaboobnagar Map
మహబూబ్ నగర్/నిజామాబాద్: ప్రమాదవశాత్తూ చెరువులో పడి నలుగురు బాలికలు మృతి చెందిన విషాద సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. జిల్లాలోని వనపర్తి మండలం శ్రీనివాసపురంలో శిరిషా, మనీషా, శివమ్మ, శశికళ అనే నలుగురు బాలికలు చెరువు గట్టున ఆడుకోవడానికి వెళ్లారు. ఆడుకుంటుండగా ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తూ చెరువులో పడ్డారు. వారిని కాపాడటానికి మిగిలిన ఇద్దరూ చెరువులో దూకారు. అయితే ఈత రాక పోవడంతో ముగ్గురు బాలికలు చెరువులోనే మృతి చెందారు.

మరో బాలికను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఒకే గ్రామంలో నలుగురు బాలికలు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఓ వ్యక్తిని మంత్రాల నెపంతో సజీవ దహనం చేశారు. జిల్లాలోని దోమకొండ మండలంలోని బీబీపేట గ్రామంలో ఓ వ్యక్తి మంత్రాలు చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ కుటుంబం అతనిని సజీవ దహనం చేసింది.

English summary
Four girls dead in Mahabub Nagar district accidentally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X