జగన్కు జయసుధ ఝలక్: రాజీనామాకు నిరాకరణ

కాగా మంగళవారం మధ్యాహ్నం తెలంగాణలో సకల జనుల సమ్మెకు మద్దతుగా వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పేరు సిబిఐ ఎఫ్ఐఆర్లో ఉన్నదన్న కారణంతో సీమాంధ్రకు చెందిన 26 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన కొండా సురేఖ, కుంజా సత్యవతి, జయసుధ తెలంగాణ ఉద్యమం దృష్ట్యా రాజీనామా చేయలేదు. అయితే సమ్మెకు మద్దతుగా మంగళవారం మధ్యాహ్నం రాజీనామా చేస్తారని తెలిసింది. అయితే రాజీనామాకు ముందే జయసుధ తాను ప్రస్తుతం రాజీనామా చేయడం లేదని చెప్పటం విశేషం.












Click it and Unblock the Notifications