కెసిఆర్పై విరుచుకుపడిన తెలంగాణ మంత్రులు

కరీంనగర్ సభకు వచ్చిన జనాలను చూసి భయపెట్టాలని కెసిఆర్ చూస్తున్నారని, ఇక్కడ ఎవరూ భయపడరని శ్రీధర్ బాబు అన్నారు. విద్యుత్తు బందయితే ఇబ్బంది పడేది తెలంగాణ ప్రజలేనని ఆయన అన్నారు. కరీంనగర్ సభకు గద్దర్, విమలక్క, కొండా లక్ష్మణ్ బాపూజీలను ఎందుకు ఆహ్వానించలేదని ఆయన అడిగారు. శ్రీధర్ బాబుపై కెసిఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే తాము పదవులకు రాజీనామా చేసి కాంగ్రెసు కార్యకర్తలుగా పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
సమ్మె చేసే హక్కు ఉద్యోగులకు ఉందని, వారిపై చర్యలు తీసుకునే హక్కు కూడా ప్రభుత్వానికి ఉందని మంత్రి కె. జానా రెడ్డి అన్నారు. తెలంగాణకు సాధించడానికి తాము కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఇబ్బందులున్నా అధిష్టానాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ నాయకులు పరస్పరం విమర్సలు చేసుకోవద్దని ఆయన సూచించారు. ఈ నెలాఖరులోగా తెలంగాణపై నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఆయన అన్నారు. సానుకూల నిర్ణయం రాకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications