హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సచివాలయ ముట్టడి, తెలంగాణ టిడిపి నేతల అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mothukupally Narasimhulu-Errabelli Dayakar Rao
హైదరాబాద్: సచివాలయ ముట్టడికి దిగిన తెలుగుదేశం తెలంగాణ నాయకులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సకల జనుల సమ్మెకు మద్దతుగా తెలుగుదేశం తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో సచివాలయ ముట్టడికి దిగారు. సచివాలయంలోకి చొచ్చుకుపోయేందుకు తెలుగుదేశం నాయకులు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డగించారు. దాంతో తెలంగాణ నాయకులు సచివాలయం గేటు వద్ద బైఠాయించారు.

బైఠాయింపు జరిపిన తెలంగాణ తెలుగుదేశం నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టయినవారిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు, కడియం శ్రీహరి, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని తెలంగాణ తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగులపై అణచివేత చర్యలకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు.

English summary
TDP Telangana leaders arrested, while they were staging dharna in front of secretariat in support of Telangana strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X