తెలంగాణపై బొత్సతో కెటిఆర్, కోదండరామ్ భేటీ

బొత్స సత్యనారాయణతో భేటీ ముగిసిన తర్వాత వివరాలను కెటి రామారావు గానీ కోదండరామ్ గానీ వెల్లడించలేదు. సకల జనుల సమ్మెపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడకపోవడాన్ని కెటి రామారావు తప్పు పట్టారు. తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోలేని స్థితిలో రాజకీయ పార్టీలు ఉన్నా సమయం కర్రు వాత పెట్టే నైపుణ్యం ప్రజలు చూపిస్తారని, ఆ రుచిని చంద్రబాబు చూడక తప్పదని ఆయన అన్నారు. బస్సు ప్రమాదంలో మరణించిన ఆటో డ్రైవర్ మల్లేష్ కుటుంబానికి పది లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాగా, సకల జనుల సమ్మె వల్ల తెలంగాణ అంతా స్తంభించిందనడం సరి కాదని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. తెలంగాణపై తమ పార్టీ తరఫున చర్చలు జరుపుతున్నామని, చర్చలు ముగిసే వరకు సహనం వహించాలని ఆయన బుధవారం న్యూఢిల్లీలో అన్నారు. తెలంగాణ విషయంలో ప్రతి ఒక్కరు కూడా విజ్ఞత ప్రదర్శించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications