బాబునే ఇక్కడి నుండి పంపిస్తాం: టిడిపి ఎమ్మెల్యే జైపాల్

రాజీనామా చేసేందుకు వెనక్కి పోయిన కాంగ్రెసు నేతలు పిరికి పందలని విమర్శించారు. తెలంగాణ బూచి చూపి కావాలనే వారు దేశ రాజధాని ఢిల్లీలో కూర్చుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న యుపిఏ ప్రభుత్వం తెలంగాణ ప్రకటించి అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశ పెడితే అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలోనూ కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణ వచ్చే వరకు ఎన్నికలు బహిష్కరిస్తామనే అంశంపై చంద్రబాబుతో స్పష్టమైన ప్రకటన ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ ప్రకటన తెలంగాణ ప్రజలను మోసం చేసేలా ఉందన్నారు.
ఐక్య ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తోడ్పాటునందించాలన్నారు. టిడిపి నేతలపై టిఆర్ఎస్ నేతల దాడి సరికాదన్నారు. ఎపికి కాంగ్రెసు శనిలా దాపురించిందన్నారు. కాగా గతంలోనూ సినీ హీరో నందమూరి బాలకృష్ణ రాజకీయ ఆరంగేట్రం చేస్తానని ప్రకటించిన సమయంలో తెలంగాణ టిడిపి నేతలం రాజీనామాలు చేసి బాలయ్యను ఆహ్వానించడానికి సిద్ధంగా లేమని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తాజాగా బాబును గెంటి వేస్తామని ప్రకటించడం విశేషం.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ?












Click it and Unblock the Notifications