చిరంజీవిని ఆడిపోసుకున్న టిడిపి అధినేత చంద్రబాబు

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చుపడిందన్నారని, వైయస్ రాజశేఖర రెడ్డి దేశంలో ఏ నాయకుడూ చేయని అవినీతి చేశాడని ఆయన విమర్శించారు.ఎన్నికలు ఎప్పుడొచ్చినా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేయడం ఖా యమని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రభు త్వ పాలన అస్తవ్యస్తంగా మారిందని, ఇలాంటి సమయంలో మనం ప్రజలకు అండగా నిలబడాలని, అందుకే ఈ యాత్రలు చేస్తున్నామన్నానని ఆయన అన్నారు. తన కుటుంబం కోసమైతే తాను ఇంత కష్టపడాల్సిన అవసరం లేదని, నన్నూ పార్టీనీ నమ్ముకున్న ప్రజల కోసమే ఇంత కష్టపడుతున్నానని ఆయన అన్నారు. ప్రాణం ఉన్నంతవరకు మీ కోసమే పనిచేస్తానని ఆయన అన్నారు. రాబోయే కాలం చాలా కీలకమైనదని ప్రతి కార్యకర్త ఈ రెండేళ్లు నిద్రమాని పనిచేసి మనరాష్ట్రాన్నికాపాడుకోవడానికి సహకరించాలని ఆయన అన్నారు.
అవినీతి, అక్రమాలపై వేలెత్తిచూపితే మనమీదే ఎదురుదాడి చేశారని మనం చెప్పిందే నేడు నిజమై ఆ అక్రమార్కులు జైలుపాలు అవుతున్నారన్నారు. ఓఎంసీ అక్రమ సొమ్మును జిల్లాకు ఖర్చుపెట్టి ఉంటే ఎంతో అభివృద్ధి జరిగి ఉండేదన్నారు. ప్రభుత్వ పెద్దలు సెజ్ల పేరుతో భూములను లాక్కుని రిల్ ఎస్టేట్ వ్యాపారాలు కొనసాగించి జేబులు నింపుకున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్, సైన్సు సిటీల పేరుతోఇదే తరహాలో మోసగించారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications