పార్టీ తెలంగాణ నేతల ఒత్తిడికి తలొగ్గిన అధిష్టానం

పరిస్థితిని గమనించిన ఆజాద్ ఆ వెంటనే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఢిల్లీకి పిలిలించి ఆజాద్ చర్చలు జరిపారు. వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బొత్స సత్యనారాయణ రాష్ట్ర విభజనకు అనుకూలంగానే ఉండడంతో పరిస్థితిని ఆయన వివరించినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలవారీగా పార్టీ పరిస్థితిపై కూడా ఆజాద్ సోనియా గాంధీకి వివరించినట్లు సమాచారం. పార్టీపరంగా నిర్ణయం తీసుకుని వెల్లడిస్తే తప్ప ప్రమాదం నుంచి బయటపడలేదమని ఆజాద్ చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా నిర్ణయం ప్రకటిస్తే, తెలుగుదేశం వంటి పార్టీలను ఆత్మరక్షణలో పడేయవచ్చునని ఆయన చెప్పినట్లు సమాచారం. తెలంగాణపై రాజకీయ నిర్ణయం ప్రకటించాల్సిందేనని ఆజాద్ గట్టిగా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
తెలంగాణ నాయకుల ఒత్తిడి, ఆజాద్ నివేదిక నేపథ్యంలో తెలంగాణపై చర్చించడానికి మాత్రమే శుక్రవారం సాయంత్రం పార్టీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి కోర్ కమిటీ సభ్యుడు కాకపోయినప్పటికీ ఆజాద్ను ఆహ్వానించారు. కోర్ కమిటీ సమావేశం నేపథ్యంలో అటు ఢిల్లీలోనూ ఇటు హైదరాబాదులోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications