వైయస్ జగన్ ఆస్తులపై ఈడి దర్యాప్తు వేగవంతం

ఇప్పటికే ఈడి మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. ఆగస్టు 30వ తేదీ ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. ఇదే సమయంలో జగన్ ఆస్తులపై సిబిఐ కూడా దర్యాప్తు జరుపుతోంది. జగన్ ఆస్తుల కేసు విచారణకు అవసరమైన సమాచారాన్ని ఈడి సిబిఐతో పంచుకుంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సమాచారాన్ని కూడా తీసుకుంది. కొన్ని ఫైళ్లను ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. వాటి ఆధారంగా ఈడి ఓ నివేదిక తయారు చేసింది. ఈడి ఏర్పాటు చేసే ప్రత్యేక బృందంలో ఆదాయం పన్ను శాఖ అధికారులు కూడా ఉంటారని తెలుస్తోంది. సిబిఐ, ఆదాయం పన్ను శాఖ సహకారం ఈడికి అత్యంత ఆవశ్యకం.
ఢిల్లీలోనే ఉన్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ శుక్రవారం జరిగే ఈడి ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొనే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. హైదరాబాదు నుంచి అధికారుల బృదం ఒకటి గురువారం ఢిల్లీకి చేరుకుంది.












Click it and Unblock the Notifications