హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందరివాడు అందనివాడే: చిరుపై ఎంపీ మోదుగుల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Modugula Venugopal Reddy
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి ఇప్పుడు ఎవరికీ అందని వాడయ్యాడని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి శుక్రవారం విమర్శించారు. చిరంజీవి పార్టీ పెట్టక ముందు అందరి వాడని ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో ఆయన కొందరి వాడయ్యాడన్నారు. ఇటీవల కాంగ్రెసు పార్టీలో చేరడంతో ఆయన ఇప్పుడు ఎవరికీ అందని వాడయ్యాడని విమర్శించారు. తెలంగాణలో జరుగుతున్న సకల జనుల సమ్మెను విరమింప చేయడంలో కాంగ్రెసు ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కనిపిస్తోందన్నారు.

మరో నేత కళా వెంకట్రావు సైతం ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి టైంపాస్ ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వానికి ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టడం లేదన్నారు. 2జి కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేయాలని మరో నేత ఎర్రన్నాయుడు శ్రీకాకుళంలో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు. లేదంటే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. హైదరాబాద్ కెసిఆర్ సొత్తు కాదన్నారు.

English summary
Telugudesam Party MP Modugula Venugopal Reddy accused Tirupati MLA Chiranjeevi today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X