ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసానికి యత్నం, లాఠీఛార్జ్

అప్రమత్తమైన పోలీసులు తెరాస కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు ఎంతకూ తగ్గలేదు. పార్టీ కార్యాలయంలోని తెలుగుదేశం పార్టీ జెండాలను దగ్ధం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. అనంతరం వారు కలెక్టరేట్లో ఉన్న దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. విగ్రహాన్ని చెప్పులతో కొట్టారు. పోలీసులు వారి చర్యలను అడ్డుకున్నారు. కాగా వరంగల్ జిల్లాలోనూ ఓ మహిళ విగ్రహాన్ని సుత్తితో పగుల గొట్టే ప్రయత్నం చేసింది. పెట్రోలు పోసి తగుల బెట్ట పోయింది. పోలీసులు ఆమె చర్యలను అడ్డుకున్నారు. సుత్తితో దాడి చేయడంతో విగ్రహం పాక్షికంగా దెబ్బతింది.












Click it and Unblock the Notifications