తెలంగాణ ఆందోళనకారులపై దండెత్తిన ముఖ్యమంత్రి

సమ్మె వల్ల ఇప్పుడు రెండు గంటల విద్యుత్తు కోత విధిస్తున్నామని, నాలుగు గంటల కోత విధించే ప్రమాదం వచ్చి పడిందని ఆయన అన్నారు. విద్యుత్తు కొనుగోలుకు 12 కోట్ల రూపాయలు ఖర్చవుతోందని ఆయన అన్నారు. హైదరాబాదు శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. తాను హైదరాబాదులో పుట్టిపెరిగినవాడినని, అందువల్ల హైదరాబాదును సుందరనగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి రూపాయకు కిలో బియ్యం పథకం అమలు చేస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications