హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రమాదంలో మంత్రి సబితారెడ్డి మేనల్లుడి మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

ranga reddy
హైదరాబాద్: రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మేనల్లుడు వెంకట్రామి రెడ్డి శనివారం ఉదయం ఓ ప్రమాదంలో మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లికి ఐదు కిలోమీటర్ల దూరంలో జరిగిన కారు ప్రమాదంలో వెంకట్రామి రెడ్డి దుర్మరణం చెందారు. అతను శంకర్ పల్లి పరిసరాల్లోని తన స్వగ్రామం నుండి శనివారం వేకువ జామున మూడు గంటలకు ఓ కారులో హైదరాబాదు బయలు దేరారు. మోకిల వద్దకు చేరుకోగానే కారు అదుపు తప్పి డివైడర్ ఢీకొంది. డ్రైవింగ్ సీట్లో ఉన్న సబితారెడ్డి మేనల్లుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

కారులో వెంకట్రామి రెడ్డి ఒక్కరే ఉన్నారు. ఆయనతో ఎవరూ లేరు. మోకిల వరకు ఎలాంటి డివైడర్లు లేక పోవడం, అక్కడకు రాగానే డివైడర్లు ఉండటం వాటికి రేడియం గుర్తులు లేక పోవడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. వెంకట్రామి రెడ్డికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. ఆయన వయస్సు నలభై వరకు ఉంటోంది. వెంకట్రామి రెడ్డి మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆయన స్వగ్రామానికి పంపించనున్నారు.

English summary
Home Minister Sabitha Indra Reddy nephew Venkat Rami Reddy died in an accident today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X