హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ అర్థరాత్రి రహస్యాలు వెల్లడించాలి: నామా

By Pratap
|
Google Oneindia TeluguNews

Nama Nageshwara Rao
హైదరాబాద్: ఢిల్లీలో అర్థరాత్రి ఎవరెవరిని కలిశారో వెల్లడించాలని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును డిమాండ్ చేశారు. ఢిల్లీలో కెసిఆర్ అర్థరాత్రుళ్లు కాంగ్రెసు నాయకులతో సమావేశాలు నిర్వహించి రహస్య ఒప్పందాలు చేసుకున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణలో సకల జనుల సమ్మె ఉధృతంగా సాగుతుంటే కెసిఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని, ఉద్యమాన్ని బలహీరనపరిచే విధంగా కెసిఆర్ వ్యవహారాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఇది ఢిల్లీ పర్యటనకు సమయం కాదని ఆయన అన్నారు.

కెసిఆర్ కాంగ్రెసు నాయకులు కెసిఆర్, కె. కేశవరావు, జానా రెడ్డిలతో రహస్యంగా సమావేశమయ్యారని అందరికీ తెలుసునని ఆయన అన్నారు. తెరాసను కాంగ్రెసులో విలీనం చేస్తారని జానా రెడ్డి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు, కె. కేశవరావు సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌కు చెప్పినట్లు వార్తలు వచ్చాయని, తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతుంటే కెసిఆర్ చర్యలు సరైనవి కావని ఆయన అన్నారు. తెలంగాణను మోసం చేసిందే కాంగ్రెసు పార్టీ అని ఆయన విమర్శించారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెలంగాణపై ఉలుకరు, పలుకరని ఆయన వ్యాఖ్యానించారు.

కెసిఆర్ చెట్టాపట్లాల్ వేసుకుని తిరుతుంటే కాంగ్రెసు పార్టీ తెలంగాణపై ఎలా దిగొస్తుందని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అడిగారు. ఢిల్లీకి వెళ్లి కెసిఆర్ ఏం సాధించుకుని వచ్చారని ఆయన ప్రశ్నించారు. రాజకీయ సంక్షోభం ద్వారానే తెలంగాణ సాధించగలమని తాము రాజీనామాలు చేస్తే కెసిఆర్ కాంగ్రెసుతో కలిసి పనిచేస్తున్నారని ఆయన అన్నారు.

English summary
TDP Telangana MP Nama Nageswar Rao lashed out at TRS president K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X