చర్చలపై తెలంగాణ ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు?

Telangana
హైదరాబాద్: సకల జనుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పటికీ వెళ్లవద్దని మెజార్టీ ఉద్యోగులు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. సమ్మె నేపథ్యంలో ఉద్యోగ సంఘాలను బుధవారం మధ్యాహ్నం ప్రభుత్వం చర్చలకు పిలిచిన విషయం తెలిసిందే. అయితే చర్చలకు వెళ్లాలా వద్దా అనే అంశంపై చర్చించేందుకు టిఎన్జీవో కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. అయితే మెజార్టీ నేతలు మాత్రం చర్చలకు వెళ్లేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఓ వైపు చర్చలకు పిలుస్తూనే ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేయడం పట్ల వారు తీవ్ర అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. చర్చలంటూ హెచ్చరికలు జారీ చేయడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులపై పెట్టిన కేసులను ఉపసంహరిస్తే చర్చలకు వెళ్లాలని మరికొందరు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణవాదుల నుండి కూడా చర్చలకు వెళ్లవద్దని ఉద్యోగ సంఘాల నేతలకు విజ్ఞప్తులు అందుతున్నాయని సమాచారం.

టిఎన్జీవో కార్యాలయంలో సమావేశానికి ముందు ఉద్యోగ సంఘాల నేత స్వామి గౌడ్ మాట్లాడారు. ప్రభుత్వం మోసపూరిత చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. సమ్మెను ఎవరూ విచ్ఛిన్నం చేయలేరన్నారు. ఉద్యోగులపై ఓ పక్క కేసులు పెడుతూననే మరోవైపు ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం బెదిరింపులకు ఉద్యోగులు లొంగే సమస్య లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+