బాన్సువాడ పోలింగ్ ప్రారంభం, ఓటేసిన పోచారం
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఉప ఎన్నిక పోలింగ్ గురువారం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరఫున పోచారం శ్రీనివాస రెడ్డి, కాంగ్రెసు తరఫున శ్రీనివాస గౌడ్ పోటీ చేస్తున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. గురువారం ఉదయం నుచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ప్రజలు ఓటు వినియోగించుకునేందుకు 186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పోలింగ్ కేంద్రాల్లో తొలిసారిగా వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోచారం శ్రీనివాస రెడ్డి గురువారం ఉదయమే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ అంశంపైనే ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏరాటు అయ్యే వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదనే వైఖరిలో భాగంగా తెలుగుదేశం పార్టీ బాన్సువాడ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టలేదు. పోచారం శ్రీనివాస రెడ్డి విజయంపై ధీమాతో ఉన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications