బాన్సువాడ పోలింగ్ ప్రారంభం, ఓటేసిన పోచారం
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఉప ఎన్నిక పోలింగ్ గురువారం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరఫున పోచారం శ్రీనివాస రెడ్డి, కాంగ్రెసు తరఫున శ్రీనివాస గౌడ్ పోటీ చేస్తున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. గురువారం ఉదయం నుచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ప్రజలు ఓటు వినియోగించుకునేందుకు 186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పోలింగ్ కేంద్రాల్లో తొలిసారిగా వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోచారం శ్రీనివాస రెడ్డి గురువారం ఉదయమే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ అంశంపైనే ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏరాటు అయ్యే వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదనే వైఖరిలో భాగంగా తెలుగుదేశం పార్టీ బాన్సువాడ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టలేదు. పోచారం శ్రీనివాస రెడ్డి విజయంపై ధీమాతో ఉన్నారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications