వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురు ఇంజనీరింగ్ స్డూడెంట్స్ ఆత్మహత్య యత్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

East Godavari Map
కాకినాడ: తల్లిదండ్రులను మోసం చేస్తున్నామని, ప్రేమలో విఫలమయ్యానని సూసైడ్ నోట్ రాస్తూ ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. కైట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న రామచంద్రాపురంకు చెందిన దుర్గా ప్రసాద్, కొయ్యురూకు చెందిన పవన్, మధు అనే విద్యార్థులు లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి లాడ్జికి వెళ్లిన వారు పురుగుల మందు తాగారు. ఇందులో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా మధు, పవన్ పరిస్థితి విషమంగా ఉండటంతో హాస్పిటల్ తరలించారు. వీరు కైట్‌లో నాలుగో సంవత్సరం చదువుతున్నారు.

తమ తల్లిదండ్రులు తమను నమ్ముకొని లక్షల రూపాయలు పెట్టి తమను చదివిస్తుంటే తాము మాత్రం చదువులో అంతగా రాణించలేక పోతున్నామని మధు, ప్రసాద్ తమ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. పవన్ తాను ప్రేమలో విఫలమైనందున ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నోట్ రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
Three Engineering students committed suicide for cheating their parents with studies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X