ప్రేమానురాగాలతో విడిపోవాలి, ద్వేషాలు వద్దు: డిఎస్

అసాధారణ పరిస్థితుల్లో తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదని ఆయన మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా అన్నారు. సాధారణ స్థితిలోనే తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని, రోశయ్య తమిళనాడు గవర్నర్గా వెళ్లిపోవడం వల్ల ఖాళీ అయిన స్థానానికి పార్టీ అధిష్టానం తనను ఎంపిక చేసిందని ఆయన చెప్పారు. ప్రత్యేక పరిస్థితేమిటో తనకు తెలియదు గానీ సాధారణ స్థితిలోనే తన ఎంపిక జరిగిందని ఆయన అన్నారు. తెలంగాణకు సంబంధించి నిబద్ధత అనేది రోజు రోజుకు మారదని, తెలుగు ప్రజలు అవగాహనతో, సమన్వయంతో సమస్యను పరిష్కరించుకోవాలని తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి ఏ విధమైన ఇబ్బంది లేదని, ముఖ్యమంత్రి బాగానే పనిచేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రతిష్టను పెంచడానికి తాను కృషి చేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications