మాలో చిచ్చు పెట్టేందుకు కుట్ర: కాంగ్రెసు నేత కెకె

కోమటిరెడ్డి దీక్ష నిర్ణయం ఈ రోజు తీసుకున్నది కాదని రెండు నెలల క్రితం తీసుకున్నారని మందా జగన్నాథం అన్నారు. ఆయన దీక్ష ఏ పరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తి లేదని, ఆయనకు తమ మద్దతు ఉంటుందన్నారు. పత్రికలు ఊహాజనిత వార్తలు రాయవద్దని కోరారు. పోలవరం టెండర్ల అంశం తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు చూసుకుంటాయని తమకు సంబంధం లేదని పొన్నం ప్రభాకర్ అన్నారు. అయితే ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నందున సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. టిడిపి కెసిఆర్ పైన వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని కానీ సకల జనుల సమ్మెపై చేస్తే సహించేది లేదన్నారు.
రెండు ప్రాంతాలలో ఉద్యమాలు చేసుకోమని చెప్పిన టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై తెలంగాణ టిడిపి నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఉద్యమం వ్యక్తుల చేతుల్లో లేదని ప్రజల చేతుల్లో ఉందన్నారు. టిడిపి తెలంగాణ నేతలు ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications