హైదరాబాదులో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల దీక్షకు నో పర్మిషన్

Harish Rao-KT Rama Rao
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల 72 గంటల దీక్షకు ప్రభుత్వం అనుమతులు నిరాకరించింది. దీంతో టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు చేపట్టే దీక్షా వేదిక కరీంనగర్ జిల్లాకు మారనుంది. తెలంగాణ సాధన కోసం నవంబరు 1 నుండి 72 గంటల దీక్ష ఉంటుందని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టీఅర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం నిరవధిక అని ప్రకటించారు. ఈ దీక్షను ఇందిరాపార్కు వద్ద చేయాలని జెఏసి, టిఆర్ఎస్ భావించింది. వారు దీక్షలు చేపట్టే నవంబరు 1నే పక్కనే ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో అవతరణ వేడుకలు ఉంటాయి. ఈ నేపథ్యంలో దీక్షలకు అనుమతి నిరాకరించారు.

న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సులోనూ దీక్షలకు పోలీసులు నిరాకరించారు. దీంతో దీక్ష వేదిక హైదరాబాద్ నుండి కరీంనగర్ మారనుంది. పట్టణంలోని సర్కస్ గ్రౌండ్స్‌లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీక్ష చేయనున్నారు. మొదట వరంగల్లో గానీ కరీంనగర్‌లో గానీ చేయాలనే చర్చ టిఆర్ఎస్‌లో వచ్చింది. అయితే మెదక్ జిల్లాలో పర్యటించిన సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు దీక్షలు కరీంనగర్‌లో ఉంటాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+