తెలంగాణపై చేసేదంతా రహస్యమే, తెలియదు: డిఎస్

D Srinivas
న్యూఢిల్లీ: తెలంగాణపై కేంద్రం, పార్టీ అధిష్టానం వ్యవహారాలు రహస్యంగానే ఉంటాయని, ఏం చేయబోతున్నారో మనకు చెప్పబోరని పిసిసి మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన అనంతరం ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీ కోర్ కమిటీ, మంత్రివర్గ వ్యవహారాల కమిటీ తెలంగాణపై చర్చిస్తోందని, అక్కడ ఏం జరుగుతుందనేది తమకు తెలిసే అవకాశం లేదని ఆయన అన్నారు. తాను సోనియా గాంధీని మర్యాదపూర్వకంగానే కలిశానని, శాసనమండలికి ఎంపిక చేసినందుకు తాను సోనియాకు కృతజ్ఞతలు తెలిపానని ఆయన అన్నారు.

తెలంగాణపై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని అనిపిస్తోందని, కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటనను బట్టి ఆ విషయం అర్థమవుతోందని ఆయన అన్నారు. తెలంగాణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పార్టీ అధిష్టానం కూడా చెబుతోందని, అందువల్ల పార్టీ నాయకులు సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. శానససభ్యులు పార్టీ మారడం తొందరపాటు చర్య అని ఆయన అన్నారు. మనోభావాలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దాన్ని వాడుకోవాలని చూస్తున్నారని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. తెరాస సంఖ్యాబలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

తెలంగాణ కోసం త్యాగం చేయడమంటే ఏమిటని ఆయన అన్నారు. రాజీనామాలు చేసి తిరిగి పోటీ చేసి మళ్లీ చట్టసభల్లోకి రావడమే త్యాగమా అని ఆయన అడిగారు. రాజీనామాలు చేసినవారు తిరిగి పోటీ చేసి మళ్లీ చట్టసభల్లో కూర్చుకుంటున్నారని, దానివల్ల ఫలితం ఉండదని తాను మొదటి నుంచీ చెబుతూ వస్తున్నానని ఆయన అన్నారు. తాను తెలంగాణకు కట్టుబడి ఉన్నానని, తెలంగాణకు త్యాగమంటే రాజీనామాలు చేసి తిరిగి పోటీ చేసి ఎన్నిక కావడం కాదని, నిబద్ధత ముఖ్యమని ఆయన అన్నారు. రాజీనామాల వల్ల తెలంగాణ రాదని ఆయన అన్నారు రాష్ట్రంలో పరిస్థితులు త్వరలో కొలిక్కి వస్తాయని, ఆ దిశగా ప్రయత్నాలు జోరందుకున్నాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+