పాపం తెలంగాణ మంత్రులదే, దిగి వచ్చేది: కోదండరామ్

సకల జనుల సమ్మె వల్లనే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణపై కదలిక వచ్చిందని ఆయన అన్నారు. సకల జనుల సమ్మె విరమణపై వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఉద్యమమేదీ ఒక రూపంలో నిరంతరం సాగదని, పంథా మార్చుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. బండిని ఒకే బ్రేకులో నడపడం సాధ్యం కాదని, అలాగే ఉద్యమాన్ని కూడా ఒకే పంథాలో నడపడం సాధ్యం కాదని, పరిస్థితిని బట్టి ఉద్యమ స్వరూపం మారాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ పంథా మాత్రమే మారిందని ఆయన చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తేవడానికే కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications