ఏ క్షణంలోనైనా తెలంగాణ ప్రకటన: పిసిసి చీఫ్ బొత్స

అంతకుముందు కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ కోమటిరెడ్డిని పరామర్శించారు. త్వరలో కేంద్రం తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. కోమటిరెడ్డి వద్దకు కేంద్రం ఓ బృందాన్ని పంపేలోగానే ఆయన ఆరోగ్యం క్షీణించిందన్నారు. మంత్రిగా కాకుండా ఓ సన్నిహితుడిగా దీక్ష విరమించాలని కోరినట్లు చెప్పారు. బక్రీద్ తర్వాత తెలంగాణపై నిర్ణయం వెలువడే అవకాశముందన్నారు. కాగా బొత్స దీక్ష విరమించాలని కోరడంలో తప్పు లేదని అయితే వెంకట్ రెడ్డి దీక్ష విరమిస్తానని చెప్పలేదని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆరు రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించలేదన్నారు. రంగారెడ్డి, హైదరాబాదులలో తెలంగాణవాదం ఉందో లేదో ఎన్నికలకు వెళితే తెలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని ఆరోపించారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ కూడా పరామర్శించారు. ఉప ఎన్నికల వల్ల తెలంగాణ రాదని గద్దర్ అన్నారు. ప్రజల్లోకి వచ్చి ఉద్యమం చేస్తేనే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. ఈ నెల 8వ తేదీ తర్వాత తెలంగాణపై ప్రకటన వస్తుందని అంటున్నారని, అది తెలంగాణకు వ్యతిరేకంగా వస్తే అగ్గి రాజుకుంటుందని నారాయణ అన్నారు. తెలంగాణకు ప్యాకేజీలంటే తెలంగాణలో కాంగ్రెసు ప్యాక్ కావడం ఖాయమని ఆయన అన్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications