వైయస్ జగన్ వర్గం శానససభ్యుల్లో గుబులు

రాజీనామాలను పరిష్కరించే విషయంలో స్పీకర్ ఓ పద్ధతిని అనుసరిస్తున్నట్లు అర్థమవుతోంది. పార్టీలకు కూడా రాజీనామా చేసిన శాసనసభ్యులపై ఆయన మొదట దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. నాగం జనార్దన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి శాసనసభా సభ్యత్వాలకే కాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేశారు. తదనంతరం స్పీకర్ ఆహ్వానాన్ని అందుకున్న శాసనసభ్యులు కూడా పార్టీకి రాజీనామా చేసినవారే. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు తమ ఎమ్మెల్యే పదవులకు మాత్రమే కాకుండా కాంగ్రెసు పార్టీకి కూడా రాజీనామా చేశారు. దీంతో తమ రాజీనామాలు ఆమోదం పొందుతాయనే భయం వారిని పీడిస్తున్నట్లు చెబుతున్నారు.
కొంత మంది శాసనసభ్యులు సోమవారం స్పీకర్ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించవద్దని కోరినట్లు సమాచారం. పది నుంచి 12 మంది శాసనసభ్యులు తిరిగి కాంగ్రెసులోకి రావడానికి ప్రయత్నాలు ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి. ఆళ్ల నాని పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమానికి స్వయంగా ఏర్పాట్లు చేశారు. అందుకు ఆయన ముఖ్యమంత్రిని కూడా కలిశారు. వైయస్ జగన్ వ్యవహార శైలి నచ్చక, రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనతో తిరిగి వారు కాంగ్రెసులోకి రావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
-
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..












Click it and Unblock the Notifications