మరోసారి చిరంజీవిని ఆడిపోసుకున్న చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: తమ పార్టీ ఓటమికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అప్పటి ప్రజారాజ్యం పార్టీ అధినేత, ప్రస్తుత కాంగ్రెసు శాసనసభ్యుడు చిరంజీవిని మరోసారి ఆడిపోసుకున్నారు. చిరంజీవి లేకపోతే విశాఖపట్నం జిల్లాలో 2009 ఎన్నికల్లో తమ పార్టీ క్లీన్‌స్వీప్ చేసి ఉండేదని ఆయన అన్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మాజీ శానససభ్యుడు గణబాబు శనివారం చంద్రబాబు సమక్షంలో శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్నికలకు ముందు గణబాబు ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. గణబాబు తమ పార్టీలో చేరిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఇప్పుడు ఎన్నికలు వస్తే విశాఖపట్నం జిల్లాలోని సీట్లన్నీ తమ పార్టీవేనని ఆయన అన్నారు. ఒక్కొక్కటిగా బయటపడుతున్న కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెసు పార్టీ తమపై బురద జల్లే కార్యక్రమాన్ని పెట్టుకుందని ఆయన విమర్శించారు.

కాంగ్రెసు పార్టీ కుళ్లు రాజకీయాలను, దివాళాకోరు విధానాలను పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఆయన సూచించారు. కాంగ్రెసు చల్లిన బురదను తాము కడుక్కోవాల్సి వస్తోందని ఆయన అన్నారు. తనపై 26 సార్లు కోర్టుకెళ్లారని, విచారణ కమిటీలు వేశారని, అయినా తనపై చేసిన ఆరోపణలను నిరూపించలేకపోయారని ఆయన అన్నారు. కాంగ్రెసు అవినీతిపై పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి కాంగ్రెసు విధానాలను ఎండగడుతామని ఆయన హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+