వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై మాట్లాడను, ఆజాద్ చెప్తారు: మనీష్ తివారీ
ఉత్తరప్రదేశ్ విభజనపై తీర్మానాన్ని చర్చ లేకుండా రాష్ట్ర శాసనసభలో ఆమోదించడం దురదృష్టకరమని ఆయన అన్నారు. చర్చ లేకుండా విభజన కోసం ఉత్తరప్రదేశ్ శాసనసభ తీర్మానాన్ని ఆమోదించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన అన్నారు. యుపిని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలనే తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తీరును ఆయన తప్పు పట్టారు. ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించిన తీర్మానంపై ప్రతిస్పందించడం కూడా అనవసరమని ఆయన అన్నారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమ పార్టీ రాష్ట్రాల విభజనపై నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.
Comments
English summary
AIIC spokesperson Manish Tiwari rejected to comment on Telangana issue.
Story first published: Monday, November 21, 2011, 17:23 [IST]