హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వర్గం భేటీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు డుమ్మా

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యుల భేటీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్పి సమావేశానికి గైర్హాజరయ్యారు. జగన్ వర్గం ఎమ్మెల్యేల భేటీ గురువారం జరగనున్నందున అందరి దృష్టి దానిపైనే ఉంది. ఎంతమంది ఎమ్మెల్యేలు జగన్‌తో ఉంటారు? ఎవరెవరు వస్తారు? రాని వారెవరు? ఇదే అంశంపై అందరి దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు కొందరు డుమ్మా కొట్టేందుకు కారణాలు చూపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కార్యక్రమం ఉన్నందున తాను భేటీకీ హాజరు కావడం లేదని కుంజా సత్యవతి అంటే, ఫ్లైట్ మిస్సయిందని కొర్ల భారతి చెప్పారు.

ఇక మరో ముఖ్య నేత శ్రీకాంత్ రెడ్డి అమెరికా వెళ్లారు. ఇప్పటికే దాదాపు కాంగ్రెసు వైపు వెళ్లిన జయసుధ, ఆళ్ల నాని, శ్రీనివాసులు, బాలనాగి రెడ్డి, శేషారెడ్డి ఈ భేటీకి హాజరు కాలేదు. ఇక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ బెంగళూరులో ఉన్నందున భేటీకి గైర్హాజరయ్యారు. అలాగే పార్టీ చీఫ్ జగన్ గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఉండటంతో ఆయన కూడా రాలేదు. కాగా మరోవైపు భేటీకి ఇరవై మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

English summary
It seems, MLAs Kunja Sathyavathi, Korla Bharathi, YS Vijayamma will not attend to YSRC chief YS Jagan camp MLAs meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X