జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఎద్దుల్లా వస్తున్నారు: జెసి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రతిపక్ష నేత పదవి నుంచి తప్పుకుని సిబిఐ విచారణకు సహకరించాలని కాంగ్రెసు శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. కాంగ్రెసు నాయకులను గ్రామాల్లోకి రానీయబోమని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ అనడం అసంబద్ధంగా ఉందని ఆయన విడిగా శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబు ఏ రోజు కూడా రైతు నాయకుడు కాలేరని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో చంద్రబాబు రైతులకు ఏం చేశారని ఆయన అడిగారు. కాంగ్రెసుపై విమర్శలు చేసిన తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెసు ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications