హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కేసు: సిబిఐ ముందుకు వాటర్ బోర్డు ప్రతినిధులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

CBI
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు విషయంలో జలమండలి ప్రతినిధులు మంగళవారం సిబిఐ ఎదుట హాజరయ్యారు. లోటస్ పాండులోని ఆయన నిర్మించిన భవనానికి సంబంధించిన మంచి నీటి కనెక్షన్ల వివరాల పైన సిబిఐ అధికారులు జలమండలి అధికారుల నుండి ఆరా తీశారు. జగన్ కొత్త ఇంటికి ఎన్ని కుళాయి కనెక్షన్లు తీసుకున్నారు, ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారు, కనెక్షన్ ఎప్పుడు ఇచ్చారు తదితర అంశాలపై వారిని ప్రశ్నించారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోని భూముల కేటాయింపులపై వివరాలు అందించేందుకు రెవెన్యూ అధికారుల బృందం వచ్చింది. భూముల కేటాయింపులకు సంబంధించిన పలు పత్రాలను సిబిఐకి అందజేసింది. భూముల కేటాయింపు విషయంలో వాన్ పిక్ ప్రతినిధులు సిబిఐ ఎదుట హాజరయ్యారు. జగన్ కంపెనీలలో పెట్టుబడుల వివరాలపై హెచ్‌డిఎఫ్‌సి హాజరయ్యారు. కాగా జగన్ ఇంట్లో స్విమ్మింగ్ ఫూల్ ఉందని దానికి కూడా మంజీరా కనెక్షన్ ఉందనే ఆరోపణలు రావడం, వాటిని వైయస్సార్ కాంగ్రెసు నేతలు ఖండించడం తెలిసిందే.

English summary
Jalamandali officers attended before CBI on tuesday in YSR Congress Party chief YS Jaganmohan Reddy's case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X