తెలంగాణపై సోనియా నిర్ణయం:కెసిఆర్ సంచలన వ్యాఖ్య

తెలుగుదేశం పార్టీ చిత్తశుద్థితో కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే తప్పకుండా మద్దతిస్తామని ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కెటి రామారావు సమావేశం సందర్భంగా మీడియాతో అన్నారు. అవిశ్వాసంపై బాబు తీరు దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఉందన్నారు. తనపై జరుగుతున్న సిబిఐ దర్యాఫ్తుపై బ్లాక్ మెయిల్ చేయడానికే అవిశ్వాసమని ఆరోపించారు. బాబు, కిరణ్ మాయావతిలాగా తెలంగాణపై తీర్మానం చేయాలని సూచించారు.
నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను లెక్కలోకి తీసుకోని ఈ ప్రభుత్వాన్ని కూల్చడమే తమ లక్ష్యమన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం, పిడి యాక్టుల ఎత్తివేతకు డిమాండ్ చేస్తామని చెప్పారు. కేంద్రమంత్రి చిదంబరం వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. రాష్ట్రంలోని పార్టీలలో ఏకాభిప్రాయం వచ్చాక ఇక ఆయన ఎందుకన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే ఆయన ఇలా మాట్లాడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications